
కోదాడ: పెన్సిల్ మొన పై మేడే చిహ్నాలు
కోదాడకు చెందిన సూక్ష్మ కళాకారుడు తమలపాకుల సైదులు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా పెన్సిల్ మొనపై కార్మికుల చిహ్నాలు చెక్కి సూక్ష్మ కళతో తన అభిమానాన్ని చాటుకున్నాడు. సైదులు గతంలో సూక్ష్మ వస్తువులు పప్పు, బియ్యం గింజలు, సబ్బు, ఆకులు, పుచ్చకాయ పై కళాత్మక అంశాలను ఆవిష్కరించి పలువురి మన్నలను పొందాడు. సైదులు కళాత్మకతను పలువురు అభినందించారు.