సూర్యాపేట జిల్లా కేంద్రంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట బైక్ లు మాయమవుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక విద్యానగర్ రమేష్ రెడ్డి హాస్పిటల్ లో పార్క్ చేసిన బైక్ ను కిలాడీలు దొంగిలించారు. దొంగతనం చేస్తున్న దొంగలు సీసీ కెమెరాకు చిక్కారు. దాదాపు నెల రోజుల్లో పదుల సంఖ్యలో వాహనాలు చోరీకి గురవుతున్నాయి.