సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి, మొండికుంటతండాలో ఎండిపోయిన పంట పొలాలను శుక్రవారం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పంటలను పరిశీలించారు. ఎస్సారెస్పీ కింద నీళ్లు ఇస్తాం పంటలు వేసుకోండని చెప్పి ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. రెండు నియోజకవర్గాలలో ఎక్కడ చూసిన ఎండిపోయిన పొలాలే దర్శనమిస్తున్నాయి అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.