కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. డయాబెటిస్, బీపీ సహా 54 ఔషధాల ధరలను సవరించింది. డయాబెటిస్ బాధితులు వినియోగించే సిటాగ్లిప్టిన్, లినాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ ధరలను రూ.15కు నుంచి రూ.20కు పెంచారు. బీపీ బాధితులు వినియోగించే టెల్మీసార్టన్, క్లోర్తాలిడోన్, సిల్నిడిపైన్ మందుల ధరను ట్యాబ్లెట్కు రూ.7.14గా సవరించారు. కొలెస్ట్రాల్ చికిత్సలో వాడే మందుల ధరలను సైతం సవరించారు.