అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మాటలు తప్ప హామీల అమలు లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. ఆరు నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా అని ప్రశ్నించారు.