తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన ప్రకటన

62చూసినవారు
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన ప్రకటన
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన ప్రకటన చేశారు. తమిళనాడులో అధికార డీఎంకే పార్టీని గద్దె దించేదాకా తాను చెప్పులు వేసుకోనని ప్రకటించారు. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా శుక్రవారం ఉదయం 10 గంటలకు 6 సార్లు కొరడాతో కొట్టుకుంటానని మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతేకాకుండా 48 రోజులు ఉపవాసం ఉండబోతున్నట్లు తెలిపారు. డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్