అబుదాబి నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగోకు చెందిన 6E 1406 విమానంలో టెక్నికల్ సమస్య వచ్చింది. దాంతో పైలెట్ ఆ విమానాన్ని ఒమన్ రాజధాని మస్కట్కు మళ్లించాడు. మస్కట్లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు. అనంతరం ప్రయాణికులు వారి గమ్యాలకు చేరుకునేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. మరోసారి విమానాన్ని పరీక్షించిన తర్వాత ప్రయాణానికి సిద్ధం చేస్తామని ఇండిగో ప్రతినిధి తెలిపారు.