'తెలంగాణకు హరితహారం' పేరు మార్పు

65చూసినవారు
'తెలంగాణకు హరితహారం' పేరు మార్పు
గత ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ పేరును కాంగ్రెస్ సర్కార్ మార్చింది. ఆ కార్యక్రమాన్ని ‘వనమహోత్సవం’గా మారుస్తూ పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై మొదటి వారం నుంచి 9 విడతలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందులో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కానున్నారు. టేకు, వేప, కానుగ, సుబాబు, చింత, మామిడి, నిమ్మ, జామ, కొబ్బరి వంటి పలు రకాల మొక్కలను నాటనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్