పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బాతుగడబకు చెందిన కిల్లక సంధ్య దేశం తరఫున మహిళల అంధుల
క్రికెట్ పోటీలకు జాతీయ జట్టులో స్థానం సంపాదించుకుంది. క్రీడల పట్ల ఆసక్తి ఉన్న ఆమెకు ఉపాధ్యాయులు శిక్షణ ఇచ్చారు. బెంగళూరులో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడింది. ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి ప్రతిభ కనబర్చింది. దాంతో ఆగస్టు 17 నుంచి 25 వరకు ఇంగ్లాండ్లో జరిగే ప్రపంచ
క్రికెట్ పోటీలకు ఎంపికైంది.