తెలంగాణ పదో తరగతి
ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో పరీక్షల ఫలితాలను ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి
పరీక్షలు జరిగాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.08 లక్షల మంది
విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలను https://results.cgg.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.