మన దేశంలో ప్రతిరోజూ నిత్యం ఏదో ఒకచోట రహదారి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.వీటిలో వ్యక్తుల మరణాలు, క్షతగాత్రులవడం కలవరపెడుతున్నాయి. బైక్ ప్రమాదాలే ఎక్కువగా జరగటం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో మైనర్లకు బండి ఇవ్వొద్దని పోలీసులు హెచ్చరించినా తల్లిదండ్రులు మారడం లేదు. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న మధ్యప్రదేశ్కు చెందిన ఈ వీడియోలో పదేళ్లు కూడా లేని పిల్లలు స్కూటీపై రోడ్డెక్కారు.