AP: గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పీడీఎఫ్, కూటమి కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగింది. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు కుమారుడిపై కూటమి కార్యకర్తలు దాడికి యత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగింది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాగా, ఏపీలో 2 పట్టభద్రులు, టీచర్ MLC స్థానానికి పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.