దర్శిలో టెన్షన్ టెన్షన్

22630చూసినవారు
దర్శిలో టెన్షన్ టెన్షన్
ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ దగ్గర మరోసారి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వైసీపీ, టీడీపీ పార్టీలకు చెందిన ఏజెంట్ల పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు టీడీపీ ఏజెంట్లు వచ్చారు. తమకు మెజారిటీ వచ్చే రాళ్ళూరు ఈవీఎంల కౌంటింగ్ ను అడ్డుకునేందుకు టీడీపీ ఏజెంట్లు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ఆరోపణలు గుప్పిచింది. ఆర్వో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఏజెంట్లు ఆరోపణ చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్