ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె పాఠశాలలో సోమవారం గణిత పరీక్ష సమయంలో పేపర్ లీక్ అయిందని DEO షంషుద్దీన్ తెలిపారు. స్కూల్లో పనిచేసే వాటర్ బాయ్ సాయి మహేశ్ ఫోటో తీసి వాట్సాప్ ద్వారా వివేకానంద పాఠశాలలో పనిచేస్తున్న విఘ్నేశ్వర్ రెడ్డికి పంపినట్లు అధికారులు గుర్తించారు. విచారణ అనంతరం డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్లను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.