AP: రాష్ట్రంలోని గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ శుభవార్త చెప్పింది. గ్రూప్-1 మెయిన్ పరీక్షకు ఆప్షన్లు మార్చుకోవడానికి మరోసారి ఏపీపీఎస్సీ అవకాశం ఇచ్చింది. పరీక్ష రాసే అభ్యర్థులు మాధ్యమం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యం, పరీక్ష కేంద్రాల వాటిలో మార్పులు చేసుకోవచ్చు అని ప్రకటించింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 2 వరకు చేసుకోవచ్చని తెలుపుతూ ఆదేశాలు జారీచేసింది.