అయోధ్య రామాలయానికి ఉగ్రవాద బెదిరింపులు

74చూసినవారు
అయోధ్య రామాలయానికి ఉగ్రవాద బెదిరింపులు
అయోధ్యలోని సుప్రసిద్ధ రామాలయానికి ఉగ్రవాద బెదిరింపులు వచ్చాయి. అయోధ్య రామ మందిరాన్ని కూల్చివేస్తామని పాకిస్థాన్ కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఈ మేరకు ఓ ఆడియో సందేశాన్ని వెలువరించింది. జైషే సంస్థ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అయోధ్య రామాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇతర భద్రతా సంస్థలు కూడా అప్రమత్తం అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్