తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన TGRJC CET 2025 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ (TREI) నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరంలో మొదటిసారికే పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ కాలేజీల్లో దరఖాస్తు చేయడానికి అర్హులు. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ కళాశాలలు. చదువు, వసతులు అన్ని కూడా ప్రభుత్వం భరిస్తుంది.