పథకాల అమలు గురించి నిర్ణయించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. చిన్నారులు ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరించిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఏదైనా విధానం లేదా పథకాన్ని అమలుచేయమని న్యాయస్థానాలు రాష్ట్రాలను ఆదేశించలేవని తెలిపింది.