భారత యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్కి బీసీసీఐ అవకాశాలు ఇవ్వకపోవడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఐపీఎల్, టీ20 వన్డే సిరీస్ల్లో రుతురాజ్ సత్తా చాటుతున్నా అతనికి అవకాశాలు ఇవ్వడం లేదని అభిమానులు మండిపడుతున్నారు. అయితే బీసీసీఐ మౌనం కారణంగా గంభీర్, గిల్లపై పలువురు విమర్శలు గుప్పించారు. రుతురాజ్ ధోనీ శిష్యుడు కాబట్టి గంభీర్ అవకాశం ఇవ్వలేదని.. రుతురాజ్ గిల్కు పోటీ కాబట్టి అవకాశం ఇవ్వలేదని చర్చించుకుంటున్నారు.