TG: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనలో నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. నిందితులను అరెస్ట్ చేసిన NIA పోలీసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దుండగులను అప్పుడు పట్టుకోకపోతే వారు మరిన్ని దారుణాలకు పాల్పడేవారని అన్నారు. నిందితులకు ఉరిశిక్ష కాకుండా నడిరోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలని NIA కోర్టుని కోరారు.