జమ్ముకశ్మీర్లో ప్రతి ఏటా నిర్వహించే అమర్నాథ్ యాత్ర.. నేటి నుంచి దాదాపు 62 రోజులపాటు కొనసాగనుంది. అంటే ఆగస్టు 19వ తేదీ వరకు ఈ అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. ఈ మేరకు… అక్కడి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంత్నాగ్ జిల్లాలోని పహల్గామ్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ రెండు మార్గాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ యాత్రకు సంబంధించిన అధికారిక పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని యాత్రకు బయలుదేరాలి.