నదిలో పడవ బోల్తా.. నలుగురు గల్లంతు

59చూసినవారు
నదిలో పడవ బోల్తా.. నలుగురు గల్లంతు
బీహార్‌ లోని సరన్ జిల్లా సోన్‌పూర్‌లో గురువారం అర్థరాత్రి నదిలో పడవ బోల్తా పడటంతో నలుగురు గల్లంతయ్యారు. ఈ క్రమంలో హైటెన్షన్ వైర్ తగిలి మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. కాగా ఆ సమయంలో పడవలో 16 మంది ప్రయాణికులు ఉన్నారు. సోన్‌పూర్ నుండి పనులు ముగించుకొని తమ గ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే బోటులోని ఓ ప్రయాణికుడు దిగాల్సిన దారిలో హైటెన్షన్ వైర్ ఉంది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో పడవ బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్