ఆఫీసులో పని ఒత్తిడిని తట్టుకోలేక 26 ఏళ్ల యువతి మృతి.. దర్యాప్తు చేస్తోన్న కేంద్రం

84చూసినవారు
ఆఫీసులో పని ఒత్తిడిని తట్టుకోలేక 26 ఏళ్ల యువతి మృతి.. దర్యాప్తు చేస్తోన్న కేంద్రం
పూణెలోని ఎర్నెస్ట్ & యంగ్ (EY) సంస్థ ఉద్యోగిని 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ మృతిపై వచ్చిన ఫిర్యాదును కేంద్ర కార్మిక శాఖ స్వీకరించింది. ఆ యువతి మృతికి అధిక పనిభారమే కారణమని ఆమె తల్లి ఆరోపించింది. "అసురక్షిత వ్యవస్థ, శ్రమ దోపిడీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోంది" అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. అన్నాని రోజూ అర్ధరాత్రి వరకు పని చేయించారని, వారాంతాల్లోనూ సెలవు ఇవ్వలేదని తల్లి చెప్పారు.

సంబంధిత పోస్ట్