బాలిక హత్య.. తగలబెట్టి చెత్త కుప్పలో పడేశారు

52చూసినవారు
బాలిక హత్య.. తగలబెట్టి చెత్త కుప్పలో పడేశారు
బాలికను హత్య చేసి తగలబెట్టి చెత్త కుప్పలో పడేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలంలోని ఓ తండాకు చెందిన కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వచ్చి ఉంటున్నారు. ఈనెల 7న వారి పెద్ద కుమార్తె (12) కిరాణా షాపు వద్దకి వెళ్లి వస్తానని తిరిగిరాలేదు. వారం రోజుల తరువాత చెత్తకుప్పలో తగలబెట్టి పురుగులు పట్టిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్