భారతదేశంలో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలాలైన మసీదులు చాలానే ఉన్నాయి. అందులో తాజ్-ఉల్-మసీదు ఒకటి. ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉంది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద, అందమైన మసీదుగా చరిత్రకెక్కింది. ఇంకా ఈ మసీదును 'మసీదుల కిరీటం' అని కూడా పిలుస్తారు. ఈ మసీదులో ఒకేసారి ఒక లక్ష మందికి పైగా జనం ప్రార్థనలు చేసుకోవచ్చు.