బాలీవుడ్ క్వీన్గా పేరు గాంచిన కంగనా రనౌత్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో హైలైట్గా నిలిచారు. గత కొన్నేళ్లుగా బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్న కంగన ఇటీవలె బీజేపీలో చేరారు. ఆమెకు తన స్వస్థలం హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ నియోజకవర్గ టికెట్ను బీజేపీ కేటాయించింది. తొలిసారి కంగనా ఎన్నికల బరిలో దిగబోతుంది. అనేక చిత్రాల్లో నటించిన కంగనా రనౌత్.. సినిమాలతోనే కాకుండా తన వ్యాఖ్యలతో కూడా చాలా ఫేమస్ అయ్యారు.