ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చేసింది. రివార్డు పాయింట్లు, వాటి ప్రయోజనాల్లో సవరణలు చేసింది. క్రెడ్, పేటీఎం, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ నుంచి చేసే రెంట్ పేమెంట్స్పై ఇకపై ఛార్జీలు వసూలు చేయాలని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయించింది. రెంట్ పేమెంట్పై 1 శాతం చొప్పున ఛార్జీ వసూలు చేయనుంది. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి.