కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై ఈఎన్సీ జనరల్ కార్యాలయం, ఓ అండ్ ఎం విభాగాల ఇంజినీర్లను చేస్తున్న విచారణ దాదాపుగా పూర్తయింది. కాళేశ్వరం ఎందుకు చేపట్టారన్న విషయమై ప్రాణహిత-చేవేళ్ల విశ్రాంత ఇంజినీర్ల కమిటీ నివేదికపై జస్టిస్ పీసీ ఘోష్ ఆరా తీశారు. గోదావరిలో నీరున్నా ప్రాణహిత నుంచి ఎత్తిపోయడంపై విచారణ చేస్తోంది.