AP: ఐదేళ్లలో వైసీపీ నాయకులు ప్రభుత్వ భూములను భారీగా ఆక్రమించారని కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి ఆరోపించారు. ఆక్రమించిన భూములన్నీ ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామన్నారు. పోలీసు శాఖ, జడ్పీ స్థలాలను కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ధ్వజమెత్తారు. భూముల ఆక్రమణలో ఎంత పెద్దవారున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. కడపలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఆమె ఈ మేరకు మాట్లాడారు.