నిపాతో మృతి చెందిన వ్యక్తి.. గతంలో కాలు చికిత్స కోసం బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు: రిపోర్ట్స్

58చూసినవారు
నిపాతో మృతి చెందిన వ్యక్తి.. గతంలో కాలు చికిత్స కోసం బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు: రిపోర్ట్స్
కేరళలో నిపా వైరస్ కారణంగా ఇటీవల 24 ఏళ్ల వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే. దీనికి ముందు అతని కాలికి గాయం కావడంతో చికిత్స కోసం బెంగళూరు నుంచి మలప్పురంలోని తన ఇంటికి వచ్చాడని పలు కథనాలు తెలిపాయి. ఈ సమయంలో మెనింజైటిస్ లక్షణాలు కనిపించడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. "అతని కాలు మీద గాయం ఉంది. దాని కోసం చికిత్స తీసుకున్నాడు. ఈ క్రమంలో అతను జ్వరం, వాంతులు సమస్యను ఎదుర్కొన్నాడు" అని పంచాయతీ సభ్యుడు ఒకరు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్