రైలు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి

85చూసినవారు
రైలు ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో సోమవారం రెండు రైళ్లు ఢీ కొన్న ఘటనలో 15 మంది మృతి చెందగా, 60మంది గాయపడ్డారు. ఈ రైలు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రైలు ప్రమాదంలో పలువురు మరణించిన వార్త చాలా బాధ కలిగించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్