కరవు కోరల్లో చిక్కుకున్న జనాలకు పట్టెడన్నం పెట్టిన ఆలయంగా తెలంగాణలోని మెదక్ చర్చి పేరుగాంచింది. మెతుకు సీమగా పిలవబడిన మెదక్ జిల్లాలో 1910లో కరువు విలయతాండవం చేసింది. అదే సమయంలో బ్రిటిష్ మత గురువు చార్లెస్ వాకర్ ప్రోస్నేట్ చర్చ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1914లో పునాది రాయి పడి, పదేళ్ల పాటు పనులు కొనసాగాయి. రాళ్లు, డంగు సున్నంతో అద్భుతమైన పనితనంతో ఆసియాలోనే రెండో అతిపెద్ద చర్చ్గా రూపుదిద్దుకుంది.