దేశంలో ప్రఖ్యాతి గాంచిన ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. సఫారీల ఏర్పాటు కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటు అక్కడి భారీ వృక్షాలను నరికివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జాతీయ పార్కు రాయల్ బెంగాల్ పులులకు ఆవాసం. 1288.31 చదరపు కిలోమీటర్లలో ఈ అటవీ ప్రాంతం ఉంది.