కమెడియన్గా అందరికీ సుపరిచితమైన వెన్నెల కిశోర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'చారి 111'. టీజీ కీర్తికుమార్ దర్శకత్వం వహిస్తున్నఈ మూవీ మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ను ఈనెల 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన కాన్సెప్ట్ టీజర్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్గా సంయుక్త విశ్వనాథన్ నటించారు.