వెస్టిండీస్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచులో రనౌట్ ను నాటౌట్గా ఇచ్చిన ఘటనపై నెట్టింట చర్చ జరుగుతోంది. 18వ ఓవర్లో జాన్సన్ వేసిన బంతికి విండీస్ ప్లేయర్ జోసెఫ్ పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యారు. దీంతో వెంటనే స్క్రీన్ బోర్డుపై ఔట్ అని చూపించారు. కానీ ఆసీస్ అప్పీల్ చేయలేదని అంపైర్ నాటౌట్ ఇచ్చారు. దీంతో విండీస్ ఖాతాలోకి ఓ పరుగును చేర్చారు. ఈ మ్యాచులో 34 పరుగుల తేడాతో ఆసీస్ జట్టు గెలుపొందింది.