రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఎమ్మెల్సీ విజేత తేలేది!

51చూసినవారు
రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఎమ్మెల్సీ విజేత తేలేది!
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తీన్మార్ మల్లన్న తన సమీప ప్రత్యర్థి.. ఏనుగుల రాకేష్‌రెడ్డిపై 18,565 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొదటి ప్రాధాన్య ఓట్లు లెక్కించిన 4 రౌండ్లలో కలిసి తీన్మార్ మల్లన్నకు 1,22,813 ఓట్లు రాగా.. రాకేష్‌రెడ్డికి 1,04,248 ఓట్లు వచ్చాయి. గెలుపు కోసం తీన్మార్ మల్లన్నకు 32,282 ఓట్లు, రాకేష్‌రెడ్డికి 50,847 ఓట్లు రావాలి.

సంబంధిత పోస్ట్