నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్కు చెందిన నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య, బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా మరో బాలుడు మృతి చెందారు. ఫిబ్రవరి 29న వీరి వివాహం జరగ్గా రెండు రోజుల క్రితమే షామీర్పేటలో రిసెప్షన్ జరిపారు. కాగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ఘోర ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.