వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి: సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచన ( వీడియో)

70చూసినవారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేద ప్రజలకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. తమ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఇంకా 40 వేల ఇళ్లు పంచేవి ఉన్నాయని, ఆ ఇళ్లను వారికి కేటాయించాలని అన్నారు. బతుకుతెరువు కోసం వచ్చి మురికి కాలువల వెంబడి ఇళ్లు కట్టుకున్న ప్రజలకు నోటీసులు ఇవ్వకుండా ఇలా రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్