జార్ఖండ్ బీజేపీ తనకు షోకాజ్ నోటీసులు పంపడం ఆశ్చర్యం కలిగించిందని బీజేపీ ఎంపి, మాజీ కేంద్ర మంత్రి జయంత్సిన్హా అన్నారు. ఆయనకు మే 20వ తేదీన షోకాజ్ నోటీసులు పంపింది. ఈ నోటీసులపై జయంత్సిన్హా తాజాగా స్పందిస్తూ.. నన్ను అన్యాయంగా, కావాలనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది’ అని జయంత్సిన్హా తన లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఆయన పోస్టు చేశారు.