AP: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసే వీడియోను తాము విడుదల చేయలేదని ఈసీ ప్రకటించడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పిన్నెల్లి వీడియోపై ఈసీ అలా ప్రకటించిందంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందని మంత్రి ఆరోపించారు. పిన్నెల్లిపై ఫాల్స్ వీడియో ట్విట్టర్లో రిలీజ్ చేసిన నారా లోకేశ్పై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.