బ్లేడుతో బెదిరించి పారిపోయిన దొంగ.. వీడియో వైరల్

51చూసినవారు
చోరీ చేస్తుండగా పట్టుబడిన ఓ దొంగ బ్లేడుతో బెదిరించి తప్పించుకున్నాడు. ఈ ఘటన ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్‌లో ఇటీవల చోటు చేసుకుంది. ఈ మేరకు ప్రయాణికుల పర్సును దొంగిలించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం అతడి చెంపలు వాయించారు. అయితే దొంగతనం ఎందుకు చేస్తున్నావ్ అని ప్రశ్నిస్తుండగా ఆ దొంగ జేబులోంచి బ్లేడు తీశాడు. దాంతో వారిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్