కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెదవి విరిచారు. ఇది నిరుపయోగ బడ్జెట్ అని, ప్రజల కోసం కాదని విమర్శించారు. ‘ఏ బడ్జెట్ అయినా అభివృద్ధి కోసం కాకపోతే, ఏ అభివృద్ధి అయినా ప్రజల కోసం కాకపోతే, అది పనికిరానిది’ అని అన్నారు. ఈ మేరకు ఎక్స్లో హిందీలో పోస్ట్ చేశారు.