భారత్ విజయం సాధించడం పట్ల విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడాడు. ఫైనల్లో టీమ్ ఇండియా విజయం సాధించడం పట్ల విరాట్ ఆనందరంలో మునిగితేలారు. ‘‘ఇది అద్భుత విజయం. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన తర్వాత మళ్లీ పుంజుకోవాలని నిర్ణయించుకున్నాం. ఈ సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం నిజంగా అద్భుతం. ప్రాక్టీస్ సెషన్లో ఎంతో శ్రమించాము. విజేతగా నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని కోహ్లీ అన్నాడు.