లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికలు దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు జరిగే ఎన్నికలని ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు ఓవైపు బీజేపీ, ఆరెస్సెస్లు ప్రయత్నిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ, విపక్ష ఇండియా కూటమి రాజ్యాంగ పరిరక్షణకు పాటుపడుతున్నాయని వివరించారు.