జోడు లింగాల ఆలయం ప్రత్యేకత ఇదే

85చూసినవారు
జోడు లింగాల ఆలయం ప్రత్యేకత ఇదే
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో జోగినాధుని ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి వారు 400 సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ జోగినాధ ఆలయంలో శివపార్వతులు పుట్టలో వెలసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే జోగిపేట గ్రామాన్ని గతంలో రామాపురం అని పిలిచేవారట. కానీ ఈ గ్రామంలో జోగినాధుని ఆలయం నిర్మించిన సమయం నుండి జోగిపేటగా మారింది. అలాగే ఈ ఆలయంలో రెండు శివలింగాలు ఒకే చోట ఉండడం విశేషం.

సంబంధిత పోస్ట్