బీహార్లోని ముంగేర్లో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలున్నాయి. వాటిలో ఒకటి సీతా కుండ్. సీతాదేవి ఇక్కడే అగ్నిపరీక్షకు నిలిచిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇక్కడ వేటి నీటి చెరువు ఏర్పడిందని చెబుతారు. ఇక్కడ సీతాకుండ్తో పాటు రాముడు, లక్ష్మణుడు, భరత, శత్రఘ్న పేర్లతో మరో 4 చెరువులు కూడా ఉన్నాయి. అయితే సీతా కుండ్లో మాత్రమే నీరు ఎల్లప్పుడూ వేడిగా ఉంటుంది. ఇందుకు కారణం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.