ఉగ్రదాడి బెదిరింపుల నేపథ్యంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అప్రమత్తమైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో జానీ గ్రేవ్స్ స్పందిస్తూ.. ‘ప్రపంచకప్కు హాజరయ్యే ప్రతి ఒక్కరి భద్రతే మా తొలి ప్రాధాన్యత. ఇందు కోసం కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం’ అని తెలిపారు.