పుదుచ్చేరిలోని రెడ్యార్పాళయంలో గ్యాస్ ఎటాక్తో వృద్ధురాలు, ఆమె కూతురు మృతి చెందారు. పుదునగర్లోని మురుగునీటి శుద్ధి కర్మాగారం నుంచి విడుదలైన గ్యాస్ ఇళ్లలోని మరుగుదొడ్లలోంచి బయటకు రావడంతో ఈరోజు ఉదయం మరుగుదొడ్డికి వెళ్తుండగా ఓ వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన కూతురు కామాక్షి, మరో 15 ఏళ్ల బాలిక కూడా స్పృహతప్పి పడిపోయింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాలని పోలీసులు సూచించారు.