తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించిన మూడు పార్టీలు

53చూసినవారు
తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించిన మూడు పార్టీలు
సీఎం రేవంత్ రెడ్డితో ఇవాళ సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీల ముఖ్యనేతలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. కోదండరాం మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్