ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యంత వేగంగా అధిరోహించిన మహిళగా ఫుంజో లామా ప్రపంచ రికార్డు సృష్టించారు. నేపాల్లోని గూర్ఖా జిల్లాకు చెందిన ఈమె 14.31 గంటల్లో దీన్ని అధిరోహించారు. 2024, మే 22న మధ్యాహ్నం 3.52 గంటలకు బేస్క్యాంపు నుంచి పర్వతారోహణను ప్రారంభించి, 2024, మే 23 ఉదయం 6.23 గంటలకు 8,848 మీటర్ల శిఖరాగ్రానికి చేరుకున్నారు.